ప్రజాశక్తి-ఏలూరు : గోపాలపురం నియోజకవర్గంలో ప్రముఖ కేంద్ర బిందువైన ద్వారకాతిరుమల మండలంలో రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి.
సత్తెన గూడెం నుండి రాళ్ల కుంట పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అసలే అవి గ్రామాల అవటంతో రాత్రిపూట ఎవరైనా అటు వెళ్ళేటప్పుడు ఎక్కడ పడతామోనని భయపడుతున్నారు. రైతులు, కూలీలు, రోజు వాణిజ్యం సాగించే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ రోడ్లు పరిస్థితి ఇంతే అన్నట్టు ప్రజలు వాపోతున్నారు.