కన్నాయిగూడేంలో రోడ్డు ప్రమాదం

Feb 16,2024 10:48 #Eluru district
road accident

ప్రజాశక్తి-కొయ్యలగూడెం  : కొయ్యలగూడెం మండలం కన్నాయిగుడేం గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కన్నయ్య గూడెం గ్రామంలో ఈ రోజు 9:20 నిముషాలకు రాజమండ్రి నుంచి గవరవరం గ్రామంలో వారి బంధువులను పరామర్శించడానికి వెళ్తుండగా కన్నయ్య గూడెం గ్రామంలో స్పీడ్ బ్రేకర్ వద్ద జిగురు మట్టి పేరుకుపోవడంతో బండి మీద నుంచి జారీ పడిపోయారు. దంపతులు ఇద్దరూ ఒక్కసారిగా పడిపోవడంతో దుర్గ 40 ఆమె వెనక్కి ఒక్కసారిగా తులిపోవడంతో అపస్మారక స్థితికి వెళ్ళిపోయింది. గ్రామస్థులు వెంటనే స్పందించి, 108 కు సమాచారం అందించడంతో వెంటనే
అంబులెన్స్ లో దగ్గర ఉన్న కొయ్యలగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రీన్ ఫీల్డ్ హై వే నిర్మాణంలో భాగంగా లారీలు తీసుకు వెళ్తున్న మట్టి రోడ్ మీద పడిపోవడంతో , ఇలాంటి సంఘటనలు రోజు పదుల సంఖ్యలో జరుగుతున్నాయి అని గ్రామస్థులు వాపోయారు, ఎన్ని పిర్యాదులు చేసిన
గ్రీన్ ఫీల్డ్ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు అని రోడ్ మీద లారీలు అన్ని ఆపేశారు. అధిక స్పీడ్ తో లారీలు వెళ్లడంతో దుమ్ము లెగిసి కళ్ళలో పడటంతో ఆక్సిడెంట్లు అవుతున్నాయని గ్రామస్థులు పేర్కొన్నారు. ఉన్నత అధికారులు వెంటనే వచ్చి దీని పై పరిష్కారం చూపాలి అని బైఠాయించారు.

➡️