ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక వైద్యశాలలో వైద్యులు ప్రవీణ్ కుమార్, సాదియాల ఆధ్వర్యంలో మంగళవారం వైద్యశాల పరిధిలోని ఆశా కార్యకర్తల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ … ఆశాకార్యకర్తలు వారివారి ఏరియా పరిధిలో ప్రభుత్వ ఆరోగ్య పథకాలు ఆరోగ్య సేవలు గురించి ఆరోగ్యశ్రీ, తదితర వాటి గురించి గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించాలని అదేవిధంగా ఆశా కార్యకర్తల పరిధిలో క్షయ రోగులు, కుష్టురోగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులున్నవారిని గుర్తించి వైద్యశాలకు తీసుకొనిరావాలని గర్భిణీలు నెలవారి టీకాలు వేయించుకుంటున్నారా లేదా మందులు తీసుకుంటున్నారా అని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని తెలిపారు. ఈ సమావేశంలో సిహెచ్ఓ బాలాజీ సూపర్వైజరు ఆకులప్ప, ఏఎన్ఎంలు, వైద్యశాల ఆరోగ్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.