electoral bonds : సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్‌

న్యూఢిల్లీ :    ఎలక్టోరల్‌ బాండ్స్‌పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుని సమీక్షించాలంటూ రివ్యూ పిటిషన్‌ దాఖలైంది. ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందన్న సుప్రీంకోర్టు తీర్పుపై న్యాయవాది మాథ్యూస్‌ జె. నెడుంపర సోమవారం ఈ రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశారు. నల్లధనాన్ని అడ్డుకునేందుకు ఆర్థిక చట్టంలోని సవరణలతో పార్లమెంటు ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని పిటిషన్‌లో తెలిపారు.  ఈ పథకం నల్లధనాన్ని పూర్తిగా నిర్మూలించలేకపోయినప్పటికీ, దాతల విషయంలో గోప్యతను పాటించడం ద్వారా కొంత మేర పారదర్శకంగా ఉందని పేర్కొన్నారు.

➡️