హైదరాబాద్ : తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా గుమ్మి చక్రవర్తి నియమితులయ్యారు. ప్రస్తుతం యాంటీ నార్కోటిక్స్ బ్యూరోలో చక్రవర్తి ఎస్పిగా పని చేస్తున్నారు. ఆయనను సీఎం తాత్కాలిక చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా నియమిస్తూ డీజీపీ రవి గుప్తా ఉత్తర్వులను జారీ చేశారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని.. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకు సీఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా చక్రవర్తి కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చక్రవర్తి స్థానంలో మరో అధికారిని నియమించుకోవడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్కు సూచించారు.