ఈనెల 15వ తేదీలోపు ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు

అమరావతి : ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను ఈనెల 15వ తేదీలోపు విడుదల చేయడానికి ఇంటర్మీడియట్‌ విద్యామండలి చర్యలు చేపట్టింది. జవాబుపత్రాల మూల్యాంకనం, మార్కుల స్కానింగ్‌కు సంబంధించిన ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. మూల్యాంకనాన్ని మరోసారి పున: పరిశీలన చేయడానికి వారంరోజులు సమయం పడుతుంది. ఇంటర్మీడియట్‌ పరీక్షలు మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు జరగ్గా.. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షలకుపైగా విద్యార్థులు హాజరయ్యారు.

➡️