ప్రజాశక్తి వార్తకు ప్రతిస్పందన

శ్రీకాకుళం : ప్రజాశక్తి దినపత్రికలో నేడు వెలువడిన ‘ అధికారుల నిర్లక్ష్యం ‘ అనే వార్తకు వెంటనే అధికారుల నుండి ప్రతిస్పందన వచ్చింది. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా గేదలపేట జంక్షన్‌ వద్ద స్తంభానికి వేలాడుతున్న తెలుగు దేశపు జెండాను చూశారు. ఈరోజు సెక్టార్‌ ఆఫీస్‌ లంకఅన్నాశామ్యూల్‌ ఆధ్వర్యంలో బిఎల్‌ఓ బూర ఎలకయ్యతో ఆ స్తంభానికి వేలాడుతున్న జెండాను తొలగించారు. పంచాయతీ కార్యదర్శి వైదేహిని ప్రస్తావించగా ఎన్నికల కోడ్‌ రాగానే తాము వాటిని తొలగించామని ఈమధ్య కాలంలోనే ఎవరో మళ్లీ పెట్టారని బదులిచ్చారు.

➡️