సామాజిక పోరాటాలపై పరిశోధన

Dec 18,2023 09:18 #sahityam

          ప్రముఖ కవి, పరిశోధకుడు, ఉత్తమ అధ్యాపకుడు డాక్టర్‌ బద్దిపూడి జయరావు దళిత సాహిత్యంపై పరిశోధన చేసి, ఆ సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించినందుకు ఆయనకు ముందుగా నా అభినందనలు. ‘తెలుగులో దళిత సంఘటన కవిత్వం-అనుశీలన’ పేరుతో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, రాజమండ్రి సాహిత్య పీఠంలో డాక్టర్‌ జి.ఎస్‌. భాస్కరరావు గారి పర్యవేక్షణలో ఈ పరిశోధనను పూర్తి చేశారు. ఈయన కవిత్వం హదయాన్ని కదిలిస్తుంది. అలాగే, ఈ పరిశోధన గ్రంథంలోని ప్రతి వాక్యం కూడా అంత శక్తివంతంగా కదిలించేలా ఉంది. సమాజంలో అనేక సంఘటనలు జరుగుతుంటాయి. అవన్నీ సాహిత్యాన్ని సష్టించలేకపోవచ్చు. కొన్ని సంఘటనలు మాత్రం ఎంతో సాహిత్యాన్ని సష్టిస్తాయి. ముఖ్యంగా దళితులపైన, పీడితులపైన, స్త్రీలపైన, దేశభక్తికి సంబంధించిన అంశాలపైన, మరికొన్ని ప్రకతి పరంగా జరిగిన హఠాత్పరిణామాలపైనా ఎంతో సాహిత్యం వచ్చింది. ఆ సంఘటనలపై ఎన్నో సిద్ధాంత గ్రంథాలు కూడా వచ్చాయి. కానీ, దళితులపై జరిగిన దాడులు, ఆ సంఘటనలనే నేపథ్యంగా చేసుకొని సిద్ధాంత గ్రంథాలు రాలేదు. కానీ, ఒక్కొక్క సంఘటన, ఆ సంఘటన ఆధారంగా వచ్చిన సాహిత్యంపై సిద్ధాంత గ్రంథాలు వచ్చాయి. కానీ, ఆ సంఘటనల క్రమ పరిణామాన్ని, ఆ పరిణామంలో కనిపించే సైద్ధాంతిక సమన్వయాన్ని తన సిద్ధాంత గ్రంథంలో పరిశోధకుడు చక్కగా విశ్లేషించారు.

డా. బద్దిపూడి జయరావు చేసిన ఈ పరిశోధన ద్వారా సమాజ స్వరూపం మన కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది. సామాజిక అంతరాలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. కొన్ని ఏండ్లుగా కొన్ని వర్గాలు, కొన్ని కులాలు- మరి కొన్ని వర్గాలు, మరికొన్ని కులాలను ఏవిధంగా పీడిస్తున్నాయో తెలుసుకోవటానికి, చరిత్రలోను, సాహిత్యంలోను అది ఎలా రికార్డు అయిందో తెలుసుకోవటానికి ఈ పరిశోధన చదవాలి. ఈ పరిశోధనంతా చదువుతుంటే ఇన్ని కష్టాలను, బాధలను ఓర్చుకుని దళితులు ఇన్నాళ్లుగా ఎలా జీవించగలుగుతున్నారో ఆశ్చర్యమేస్తుంది. కంచికచర్ల కోటేశు సజీవ దహనం తర్వాత జరిగిన అనేక సంఘటనలను, దానికి ముందు ఉన్న దళిత ఉద్యమ స్వరూప స్వభావాలను గుర్తించడానికి కూడా ఈ పరిశోధన గ్రంథాన్ని అధ్యయనం చేయాల్సిందే! ఈ విషయాన్ని వివరించే ముందు పరిశోధకుడు పాటించిన ఒక నవ్య పరిశోధనా పద్ధతి గురించి మనం చెప్పుకోవాలి. ఇది నాలుగు అంచెలుగా జరిగిందని సూత్రీకరించే అవకాశం ఉంది.

1. చరిత్రలో జరిగిన సంఘటన, అంటే ప్రజలకు తెలిసిన సంఘటనను తెలియజేస్తూ మొదటి దశలో దాన్ని పరిచయం చేస్తాడు పరిశోధకుడు.

2. రెండవ దశలో ఆ సంఘటనకు సంబంధించిన పూర్వపరాలను అన్వేషిస్తాడు. ఆ అన్వేషణ కేవలం గ్రంథాల్లో దొరికేది, తీర్పుల్లో దొరికేది కూడా కాదు; ఆ సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లి వాస్తవాన్ని అన్వేషించేది. ఆ అన్వేషణ ఆ సంఘటన జరిగిన వ్యక్తుల సజీవ అనుభవాలను రికార్డు చేసేది. ఆ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన వాళ్ళ అనుభవాలను రికార్డు చేసేది. పుస్తకాలు, పత్రికలు, డాక్యుమెంటరీలు, వీడియోల నుంచి; మనుషుల నుంచి, స్థలాల నుంచి, ప్రభుత్వం నుంచి, చట్టాల నుంచి, న్యాయస్థానాల నుంచీ సమాచారం సేకరించారు.3. అలా సేకరించిన సమాచారాన్ని మరలా తాను ఆ సారాంశాన్ని ఎంతో ఆసక్తిగా చెప్పడం పరిశోధకుడిలోని గొప్ప సజనాత్మక నైపుణ్యానికి నిదర్శనం. ఇది మూడవ దశ.4. నాలుగవ దశలో శాస్త్రీయంగా దాన్ని సిద్ధాంతం చేయడం లేదా ఒక సిద్ధాంతానికి సమన్వయం చేయడం. అది కూడా పరిశోధకుని ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తుంది. సామాజిక బాధ్యతతో చేసిన పరిశోధనను మళ్లీ సమాజం వైపు తీసుకువెళ్లడానికి రూపొందించుకున్న ఒక ప్రత్యేక పరిశోధన విధానం ఈ సిద్ధాంత గ్రంథంలో నిక్షిప్తమై ఉంది. ఈ ప్రత్యేక పరిశోధన విధానాన్ని గమనించని వారికి ఈ సిద్ధాంత గ్రంథం మళ్లీ ఒక కథ చెప్తున్నట్లు అనిపిస్తుంది. ఏ పరిశోధన విధానాన్నీ పాటించకుండా చెప్తున్నట్లనిపిస్తుంది. సంఘటనల్ని ప్రధానంగా చేసుకొని ఈ పరిశోధకుడు తన సిద్ధాంత గ్రంథాన్ని రూపొందించాడు. భారతీయ సమాజాన్ని ప్రశ్నించిన అనేక సంఘటనల్లో ఈ దళితుల మీద జరిగిన దాడుల సంఘటనలను తన పరిశోధనకు తీసుకున్నారు. కొన్ని సంఘటనలు, దానిపై వచ్చిన కవిత్వం, దాని ఆధారంగా తన సైద్ధాంతిక విశ్లేషణ ఎలా కొనసాగిందో ప్రస్తావిస్తాను.

కంచికచర్ల కోటేశు సంఘటన (1969). మీద ఎంతో మంది కవిత్వం రాశారు. ఈ సందర్భంగా ఆ సంఘటనలన్నింటినీ కూడా పరిశోధకుడు ఒక క్రమపద్ధతిలో వివరిస్తాడు. అంతర్జాతీయంగా కలిగించిన ప్రభావాన్ని కూడా విశ్లేషిస్తాడు. ఒక దళితుడి ప్రేమను, ఒక దళితుడి నిస్సహాయతను, దళితేతర స్త్రీ దళితుణ్ణి ప్రేమించినా, కామించినా దాన్ని వాళ్ళు వక్రీకరించి దళితులపై సామూహిక దాడులెలా చేస్తారో ఆ సంఘటన తెలియజేసిందనే స్పహను కలిగిస్తాడు. దళితేతరులు తమ తప్పు బయటపడకుండా కప్పిపుచ్చుకోవడానికి ఎలా ప్రయత్నిస్తారో ఈ సంఘటన తెలియజేసిందని వ్యాఖ్యానిస్తాడు. కంచికచర్ల కోటేశు ప్రేమ ఒక అంటరాని ప్రేమగా అభివర్ణించిన కలేకూరి ప్రసాద్‌ కవిత తెలుగు సాహిత్యంలో దళితులు ప్రేమిస్తూ సజీవంగా దహనమైపోవడానికైనా ఎలా సిద్ధపడిపోతారో ఈ సంఘటన ద్వారా చాటి చెప్తుందని సిద్ధాంతీకరిస్తాడు. తన తప్పు లేకపోయినా నవ్వుతూ చితి మంట మీద కాలిపోయిన దళితుడి పవిత్రమైన ప్రేమకు కంచికచర్ల కోటేశు సంఘటన ఒక సజీవ ఉదాహరణ నిలిచిపోయిందంటాడు.

కారంచేడు సంఘటన (1985) : అంబేద్కర్‌ తెచ్చిన చైతన్యం దళితుడిని చదువుకోడానికి ప్రేరేపించింది. అంబేద్కర్‌ తెచ్చిన చట్టాలు బహుజనుల అందరిలోనూ ఒక చైతన్యాన్ని నింపాయి. ఒకవైపు తమ శ్రమతో భూమిని బంగారు పంటలు పండించడం, మరొకవైపు అంబేద్కర్‌ ఇచ్చిన చైతన్యంతో అవమానాల్ని పోగొట్టుకోవడానికి ఆత్మగౌరవం నిలబెట్టుకోవడానికి చదువుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ చైతన్యం నేడు బహుజనుల అందరిలోనూ వస్తోంది. కానీ, ఆ చదువులకు తగిన ఫలితం పొందుతున్నారా? లేదా? అనేది మరో కోణం. తమకు శ్రమ చేసిన వాళ్లు, తమకు జీవాతాంతం ఊడిగం చేస్తూ బానిసలుగా బతికినవాళ్ళు, నేడు తలెత్తుకొని నిలబడటం, ఆత్మగౌరవంతో మాట్లాడడం ఆధిపత్య వర్గాలకు నచ్చలేదు. దాడి చేయడానికి ఎదురుచూశారు. దాని ఫలితమే కారంచేడులో దళితుల ఊచకోత సంఘటన. ఈ సంఘటన ద్వారా ప్రజా గాయకుడు గద్దర్‌ కేవలం వర్గ స్పహ మాత్రమే కాకుండా కుల చైతన్యం కూడా తోడై ‘దళిత పులులమ్మా… కారంచేడు భూస్వాములతో కలబడి, నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ’ అనే పాట ఆవిర్భావానికి కారణమైందని వ్యాఖ్యానిస్తారు.

నీరుకొండ సంఘటన (1987) : రాజకీయంగా తమ ఓటమి లేదా తమ వైఫల్యాలను సమీక్షించుకోలేని కొన్ని ఆధిపత్య కులాలు, వర్గాలు ఆ అసహనాన్ని కూడా దళితుల మీద చూపించి దాడులు చేసే ఒక వికృతమైన స్వభావానికి నిదర్శనంగా నిలుస్తుందీ ఈ సంఘటన. కొన్ని ఆధిపత్య కులాల వాళ్ళు తమ పదవి పోయినందుకే దళితులు సంతోషంతో కొబ్బరికాయలు కొట్టారని భావించి, నీరుకొండ దళితుల మీద దాడి చేయడం అనేది ఎంత వికతమైన చర్యో గమనిస్తే తెలుస్తుంది.

ఇలా ఒక్కొక్క సంఘటన దళితుల్లోని ఒక్కొక్క పార్శ్వాన్ని, ఒక్కొక్క పోరాట పటిమనీ బయటకు తీసుకురావడానికి కారణమయింది. అది ఈ సిద్ధాంత గ్రంథంలో ఉన్న ప్రధానమైన ప్రతిపాదన. దీన్ని ఆకట్టుకునేలా, అర్థమయ్యేలా వివరించడం ఈ పరిశోధనలో కనిపించే శైలీ రమ్యత.

కొన్ని కులాలకు లేదా కొన్ని వర్గాలకు అధికారం వచ్చినంత మాత్రాన వారికి అన్నీ లభించినట్లు కాదు. అధికారం వచ్చిన తర్వాత కూడా దాన్ని నిలబెట్టుకోవడానికి సామాజికంగా బలం కావాలి. అది సామాజిక చైతన్యంతో కూడిన ఆర్థికశక్తుల వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. ఆ చైతన్యం వల్ల తమ సంస్కతి గొప్పదనే భావన కలిగిన వాళ్ళు దాన్ని ఉన్నతమైనదానిగా కూడా ప్రచారం చేస్తారు. ఆ ప్రచారం వల్ల సంస్కతిలో విలువల వ్యాఖ్యానం మొదలవుతుంది. అలాంటి విలువల వ్యాఖ్యానం చేసేటప్పుడు వీరి చరిత్ర ఆ విలువల వ్యాఖ్యానానికి ఆటంకంగా నిలుస్తుంది. వారి చరిత్ర, సంస్కతి ఇంత ఉన్నతమైంది కాకపోయినా అధమ స్థాయిలో ఉందని నిరూపించడానికి కూడా ఇలాంటి సంఘటనాత్మక కవిత్వం ద్వారా వచ్చిన సైద్ధాంతిక గ్రంథాలు ఎంతగానో తోడ్పడతాయి. అప్పుడు సాంస్కతిక విలువల పునర్వ్యాఖ్యానం మొదలవుతుంది. ఇవన్నీ ఊహించిన వాళ్ళు చరిత్రని నిషేధించాలన్నారు. చరిత్ర నిషేధించినా, జరిగిన ఆ సంఘటనల ఆధారంగా వచ్చిన సాహిత్యం ఏమైపోతుంది? ఆ సాహిత్యాన్ని సిద్ధాంతీకరించిన భావాలేమైపోతాయి? ప్రజల మెదళ్ళలో కొలువై కూర్చుంటాయి. అవన్నీ ప్రశ్నలై తలెత్తుకుని నిలబడేలా చేస్తాయి. కొన్ని సంఘర్షణలు ముందుకు వస్తాయి. కార్ల్‌ మార్క్స్‌ సిద్ధాంతాలు, మహాత్మాజ్యోతీ బా ఫూలే, అంబేద్కర్‌ సిద్ధాంతాలు… ప్రజల్ని ఎలా ఆలోచనలో పడేసాయో, ఈ సిద్ధాంతాలు కూడా అలాంటి ఆలోచనలకు మరింత పదును పెడుతూ కుసంస్కతిని ప్రశ్నిస్తాయి. అలాంటి గురుతర బాధ్యతను ఈ సిద్ధాంత గ్రంథం కూడా నిర్వహించబోతోంది.

తనకు డాక్టరేట్‌ డిగ్రీ కావాలనుకుని మాత్రమే చేసిన పరిశోధన కాదిది. ఒక సామాజిక పరివర్తనను ఆశించిన పరిశోధన. తెలుగు సాహిత్యంలో దళిత సాహిత్య ప్రత్యేకతను తెలిపిన పరిశోధన, దళిత ఉద్యమాన్నీ, దళిత సాహిత్య ఉద్యమాన్నీ ఒక సైద్ధాంతిక దక్పథంతో సమన్వయించిన పరిశోధన. ఇంత గొప్ప పరిశోధన చేసిన డా.బద్దిపూడి జయరావు గారిని సమాజంలో జరుగుతున్న వివిధ సామాజిక ఉద్యమాల్ని, వారి సమస్యల్ని అర్థం చేసుకోవాలను కొనేవారందర్నీ ఈ సిద్ధాంత గ్రంథాన్ని చదవాలని కోరుతున్నాను.

– ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలుగు శాఖాధ్యక్షుడు, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌

➡️