వాడవాడలా “రిపబ్లిక్ డే” వేడుకలు

Jan 26,2024 16:39 #Konaseema
republic day celebration in alamuru

ప్రజాశక్తి – ఆలమూరు : 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మండల పరిధిలోని వాడవాడలా శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు, జెడ్పిటిసి తోరాటి సీతామహాలక్ష్మి, ఎంపీడీవో జాన్ లింకన్ ఆధ్వర్యంలోనూ, రెవెన్యూ కార్యాలయం వద్ద తహసీల్దార్ ఐ పి శెట్టి ఆధ్వర్యంలోనూ, స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఎస్సై ఎల్.శ్రీను నాయక్ ఆధ్వర్యంలోనూ, గ్రామ పంచాయతీల వద్ద, వివిధ స్కూల్లో సర్పంచులు, పిఎంసి చైర్మన్ ల ఆధ్వర్యంలో పతాక ఆవిష్కరణలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనవరి 26 డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం అమలైన దినోత్సవంగా వివరించారు. విద్యార్థులు జాతీయ గీతాలు ఆలపించారు. స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు.

➡️