బిజెపి ఎంపి అభ్యర్థిని తొలగించండి.. గిరిజనులకు టిక్కెట్‌ ఇవ్వండి..

ప్రజాశక్తి-కురుపాం : నకిలీ గిరిజన మరియు ఆర్థిక నేరస్థురాలు పాల్పడినటువంటి కొత్తపల్లి గీతకు బిజెపి అధిష్టానం ఎంపీ టికెట్ ఎలా కేటాయించిందని బిజెపి సీనియర్ నాయకులు మరియ మాజీ ఎంపీపీ హిమరక నీలకంఠేశ్వరరావు బిజెపి అధిష్టానానికి ప్రశ్నించారు. సోమవారం మండలంలో నీలకంఠాపురం పంచాయతీ కేంద్రంలో గిరిజన యువత, గిరిజనులతో కలిసి కొత్తపల్లి గీత టిక్కెట్లు రద్దుచేసి అచ్చమైన గిరిజనులకు కేటాయించాలని ప్లేకార్డులతో నినాదాలతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్టీ కాదని కోర్టు కూడా తీర్పు ఇచ్చిందని అంతేకాకుండా ఆర్థిక నేరస్థురాలుగా ముద్ర ఉన్నటువంటి వ్యక్తికి బిజెపి టికెట్ ఇవ్వడం సమంజసం కాదని వెంటనే అచ్చమైన గిరిజనులకు టికెట్ కేటాయించాలని లేనిచో ఆమెను ఓడించడానికి గిరిజనులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన యువత, గిరిజనులు పాల్గొన్నారు.

➡️