సబ్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీ మృతి

ప్రజాశక్తి-మదనపల్లి మదనపల్లి స్పెషల్‌ సబ్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీ అనుమానాస్పద స్థితిలో మతి చెందడం బుధవారం కలకలం రేపింది. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం, ముత్తుకూరుకి చెందిన మొగిలప్ప (67) నాటు సారా కేసులో అరెస్టయ్యాడు. నిందితున్ని మంగళవారం రాత్రి తీసుకొచ్చి పోలీసులు మదనపల్లి స్పెషల్‌ సబ్‌ జైల్లో రిమాండ్‌ చేశారు. సబ్‌ జైల్‌ బ్యారక్‌లో ఉంటున్న మొగిలప్ప బుధవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉండడాన్ని గుర్తించి వెంటనే జైలర్లు మొగిలప్పను మదనపల్లి జిల్లా ఆస్పత్రి అత్యవసర విభాగానికి తరలించారు. పరీక్షించిన అత్యవసర విభాగం డాక్టర్లు అతను అప్పటికే చనిపోయాడని నిర్ధా రించారు. అనంతరం సబ్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీ మతి చెందిన విషయం తెలుసుకున్న మదనపల్లి ఆర్‌డిఒ హరిప్రసాద్‌ జిల్లా ఆస్పత్రి మార్చురీలో ఉన్న మతదేహాన్ని తహశీల్దార్‌ రమాదేవి, సిఐ వల్లిబాష, ఎస్‌ఐ వెంకట సుబ్బయ్య, సబ్‌ జైలర్‌ రామకృష్ణ యాదవ్‌ సమక్షంలో క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం మతికి గల కారణాలపై మతుని కుటుంబీకులను, మాల మహానాడు నాయకులను విచారించారు. మతికి గల కారణాలపై పూర్తిస్థాయి విచారణచేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు ఆర్‌డిఒ తెలిపారు.

➡️