వాల్‌ డిస్నీలో రిలయన్స్‌కు మెజారిటీ వాటా

Dec 25,2023 20:25 #Business, #Relince

న్యూఢిల్లీ : వాల్‌ డిస్నీ ఇండియాలో మెజారిటా వాటా కొనుగోలుకు రిలయన్స్‌ ఇండిస్టీస్‌ ఒప్పందం చేసుకుంది. గత వారం లండన్‌లో వాల్ట్‌ డిస్నీ- రిలయన్స్‌ ఇండిస్టీస్‌ మధ్య నాన్‌ బైండింగ్‌ ఒప్పందం జరిగింది. మెగా విలీనం తర్వాత రిలయన్స్‌ యాజమాన్యంలోని వయాకామ్‌18కు స్టార్‌ ఇండియా సబ్సిడరీ అవుతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఈ విలీనం పూర్తి కానుందని ఆ వర్గాలు తెలిపాయి. దీంతో వయాకామ్‌18కు 51 వాటా స్టార్‌ ఇండియాకు 49 శాతం వాటా చేరిపోతుంది. మెగా విలీనం తర్వాత రిలయన్స్‌ యాజమాన్యంలోని వయాకామ్‌18కు స్టార్‌ ఇండియా సబ్సిడరీగా మారనుంది.

➡️