నూతన ఓట్ల నమోదు

Dec 3,2023 01:25

ప్రజాశక్తి – భట్టిప్రోలు
ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు శనివారం నిర్వహించిన ప్రత్యేక ఓటర్ల స్పెషల్ డ్రైవ్‌లో నూతన ఓట్లు నమోదైనట్లు తహశీల్దారు ధూళిపూడి వెంకటేశ్వరరావు తెలిపారు. మండలంలోని వివిధ పోలింగ్ కేంద్రాల్లో బూతు స్థాయి అధికారులు ప్రజల నుండి నూతన దరఖాస్తులు స్వీకరించారని తెలిపారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓటర్ల సేకరణ కార్యక్రమాన్ని తహశీల్దారు పరిశీలించారు. ఓటు హక్కు ప్రతి ఒక్కరి బాధ్యతని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును పొందేందుకు ముందుకు రావాలని కోరారు. బిఎల్వోలు కూడా ఆయా బూతుల పరిధిలోని యువతీ, యువకులను గుర్తించి వారికి ఓటు హక్కు కల్పించేందుకు కృషి చేయాలని అన్నారు. ఈపాటికే ప్రతి బిఎల్ఓ రోజుకు రెండు నూతన ఓట్లను చేర్పించే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. దీనిని మరింత విస్తృతపరచి ఓటుకు అర్హత కలిగిన ఏ ఒక్కరూ ఓటు లేకుండా ఉండకూడదు అనే దృక్పథంతో పనిచేయాలని అన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ శివరామకృష్ణ, వీఆర్వోలు ఉన్నారు.

➡️