టిడిపి అధిష్టానంపై తెలుగు తమ్ముళ్ల తిరుగుబాటు

ప్రజాశక్తి-అవనిగడ్డ : కృష్ణాజిల్లా అవనిగడ్డలో తెలుగుదేశం పార్టీ అధిష్టానంపై తెలుగు తమ్ముళ్లు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఆదివారం కూటమి భాగస్వామి అయిన జనసేన ప్రకటించిన స్థానాలలో అవనిగడ్డ ఉండటంపై టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ కు కూటమి అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పొత్తుల్లో భాగంగా అవనిగడ్డను జనసేనకు కేటాయించడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సామూహిక రాజీనామా చేసేందుకు నేతలు సిద్ధపడుతున్నట్లు సమాచారం.

➡️