వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 25 పెంపు

న్యూఢిల్లీ :    వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.25 పెరిగింది. పెరిగిన ధరలు నేటి నుండే అమల్లోకి రానున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.  తాజా ధరల పెంపుతో .. ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ రిటైల్‌ ధర రూ. 1,795కి చేరింది. ముంబయిలో సిలిండర్‌ ధర రూ.1,749, చెన్నై, కోల్‌కతాలో వరుసగా రూ.1,960, 1,911కి పెరిగింది.

వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధరను పెంచడం వరుసగా ఇది రెండోసారి కావడం గమనార్హం.   నెలరోజుల వ్యవధిలోనే రూ. 39 పెరిగింది.   గతేడాది డిసెంబర్‌లో వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.21 పెంచింది.   అయితే నూతన సంవత్సరం సందర్భంగా 19 కిలోల వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధరలను సిలిండర్‌కు రూ. 39.50 తగ్గించినట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 1న గ్యాస్‌ సిలిండర్‌పై రూ.14 పెంచుతున్నట్లు ప్రకటించింది. నేడు రూ.25 ను పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి.   దీంతో  జనవరిలో తగ్గింపును నెలరోజుల వ్యవధిలో రెండు సార్లు  పెంచుతూ సరిసమానం చేశాయి.

గృహ వినియోగ ఎల్‌పిజి సిలిండర్‌ (14.2) ధర యథాతథంగానే కొనసాగుతుందని చమురు సంస్థలు తెలిపాయి.  ఢిల్లీలో 14.2 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 903, కోల్‌కతాలో రూ. 929, ముంబయిలో రూ.902.50, చెన్నైలో రూ. 918.50గా ఉంది.

➡️