‘రావు రమేష్ను ఇప్పటివరకు చూసిన దాని కన్నా పదిరెట్లు ఎక్కువ ఎంటర్టైన్ క్యారెక్టర్లో కనిపిస్తారు. మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమా చిత్రీకరణపరంగా ఆయన మాకు ఎంతో సహాయంచేశారు. ఆయన షెడ్యూల్ బిజీగా ఉన్నప్పటికీ ఎక్కువ డేట్స్ కేటాయించి ఎంతో సహకరించారు’ అని దర్శకుడు లక్ష్మణ్కార్య అన్నారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాలో రావు రమేష్ది లీడ్ రోల్. నటి ఇంద్రజ కూడా కీలకపాత్రధారి. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, అజరు, హర్షవర్థన్, ప్రవీణ్ ఇతర ప్రధాన తారాగణం. కళ్యాణ్నాయక్ సంగీతం, బాల్రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు.