కడప జిల్లాలో ఘనంగా రంజాన్ వేడుకలు

Apr 11,2024 11:57 #Kadapa

ప్రజాశక్తి-కడప అర్బన్ : పవిత్ర రంజాన్ వేడుకలను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా మసీదులు, ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు ముస్లిం సోదరులు నిర్వహించారు. నగరంలోని బిల్టాప్ అమీనీయ ఈద్గాలో పెద్ద ఎత్తున చేరుకున్న ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నమాజు చదివి, ఒకరినొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రార్థనల్లో అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి అరిఫూల్లా హుస్సేని, ఉప ముఖ్యమంత్రి ఆంజాద్ బాషా, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస రెడ్డి, కడప నియోజకవర్గ మాజీ ఇంచార్జి అమీర్ బాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నజీర్ అహ్మద్, పలువురు నాయకులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

➡️