Rameshwaram Cafe: బాంబు పేలుడు కేసులో నిందితుడి గుర్తింపు

బెంగళూరు : బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు గుర్తించారు. నిందితుడు ముస్సావిర్‌ షాజిబ్‌గా తేల్చారు. అతడు కర్ణాటకలోని శివమొగ్గకు చెందినవాడని తెలిపారు. పేలుడు అనంతరం చెన్నైలో స్నేహితుడితో కలిసి ఉంటున్నాడని పోలీసులు గుర్తించారు. స్నేహితుడు కూడా తమిళనాడులోని ఓ హత్య కేసులో మోస్ట్‌ వాంటెడ్‌ ముద్దాయని తెలిపారు. మార్చి 1న బాంబు పేలుడు జరగ్గా ఈ కేసును ఎన్‌ఐఎ దర్యాప్తు చేస్తోంది.

➡️