రాములోరు కలిపారు ఇద్దరినీ..

శ్రీరామనవమి ఉత్సవాల్లో అంగర, గోపి

ప్రజాశక్తి – పాలకొల్లు

ఎన్నికల వేళ బిజీబిజీగా ఉన్న భిన్న ధృవాల నేతలను రాములోరు కలిపారు. శ్రీరామ నవమి సందర్భంగా బుధవారం పాలకొల్లు గుత్తుల వారి పేటలోని రామాలయం వద్ద వైసిపి అభ్యర్థి గుడాల గోపి, మాజీ ఎంఎల్‌సి అంగర రామ్మోహన్‌ కలిశారు. ప్రచారంలో ఇరు పార్టీల వారు విడివిడిగా విమర్శించుకుంటున్నా రాములోరి సాక్షిగా ఆప్యాయంగా పలకరించుకున్నారు. అంగరతో పాటు వైసిపి నేతలు యడ్ల తాతాజీ, అడబాల వెంకటరమణ, కర్రా జయ సరిత, పెచ్చెట్టి విమల లక్ష్మి, జోగి వెంకటేశ్వరరావు, టిడిపి నేత పొట్లూరి అప్పన్న పాల్గొన్నారు.

➡️