హైదరాబాద్ : సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టులో మరోసారి నిరాశ ఎదురయింది. ‘వ్యూహం’ చిత్రాన్ని వర్మ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం విడుదలను ఆపేయాలని నారా లోకేష్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ నెల 11వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది. సినిమా సెన్సార్ సర్టిఫికెట్పై స్టే విధించింది. ఈ నేపథ్యంలో, ఈ చిత్ర నిర్మాత హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. తాజా పిటిషన్లో హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేశారు. సినిమా విడుదల కాకపోవడం వల్ల తమకు కోట్ల రూపాయల నష్టం వచ్చిందని కోర్టుకు తెలిపారు. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని సీజేఐ తెలిపారు. ఈ నెల 8 లోపు విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని సింగిల్ జడ్జికి సీజేఐ ఆదేశాలు జారీ చేశారు.