రాక్షస పాలన అంతమే థ్యేయం

ప్రజాశక్తి-యర్రగొండపాలెం రాష్ట్రంలో రాక్షస పాలన అంతమే టిడిపి కూటమి థ్యేయమని టిడిపి యర్రగొండపాలెం ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు కుమార్తె డాక్టర్‌ గూడూరి చెల్సియా, కుమారుడు గూడూరి అజిత్‌ అన్నారు. సోమవారం మండలంలోని వీరభద్రాపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ హామీలను ప్రజలకు వివరించారు. ఈ ఎన్నికలలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. పిల్లలకు మంచి ఉద్యోగాలు వస్తాయని, మహిళలకు రక్షణ ఉంటుందని, రాజధాని పూర్తి అవుతుందని తెలిపారు. మే 13న జరగబోయే ఎన్నికలలో కూటమి అభ్యర్థులైన తన తండ్రి గూడూరి ఎరిక్షన్‌బాబును ఎమ్మెల్యేగా, మాగుంట శ్రీనివాసులురెడ్డిని ఎంపిగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్‌ చేకూరి సుబ్బారావు, నాయకులు మంత్రూ నాయక్‌, వేగినాటి శ్రీనివాస్‌, చేదూరి కిశోర్‌, అడుసుమల్లి రామచంద్రమయ్య, మత్తులూరి మల్లికార్జున, ఓర్సు వెంకటేశ్వర్లు, కైపు వెంకటరెడ్డి, షేక్‌ సలీం తదితరులు పాల్గొన్నారు.

➡️