నూతన ఎస్ఐగా రాజశేఖర్

Feb 2,2024 22:34

ప్రజాశక్తి – వేమూరు
నూతన ఎస్‌ఐగా రాజశేఖర్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన నాగరాజు విఆర్‌కు వెళ్లగా చందోలు ఎస్‌ఐగా పనిచేస్తున్న రాజశేఖర్‌ను సాధారణ బదిలీల్లో నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు పనిచేస్తామని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చిత్తశుద్ధితో వ్యవహరించి ఎన్నికలు సజావుగా జరిగే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. విఆర్‌కు బదిలీ అయిన నాగరాజును పోలీస్ సిబ్బంది ఘనంగా సత్కరించారు.

➡️