పాచిపెంటలో రాజన్నదొర ప్రచారం

Apr 6,2024 21:48

ప్రజాశక్తి – పాచిపెంట : మండల కేంద్రమైన పాచిపెంట బిసి కాలనీలో గడపగడపకు ఎన్నికల ప్రచారం డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర శనివారం నిర్వహించారు. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గ్రామంలో ఆయనకు ప్రజలు నీరాజనం పడుతూ హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో ఆయన ఇంటింటికి వెళ్లి ఫ్యాను గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను ఆయన అభ్యర్థించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గొట్టాపు ముత్యాలునాయుడు, డోల బాబ్జీ, టి.గౌరీశ్వరరావు, పి.వీరమనాయుడు, వైస్‌ ఎంపిపిలు ఎం.నారాయణ, కె.రవీంద్ర, ఇజ్జాడ అప్పలనాయుడు, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్వతీపురం టౌన్‌ : పట్టణంలోని పలు వార్డుల్లో స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు శనివారం ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేశారు. బెలగాంలోని 20,21 వార్డుల్లోని పట్టణ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి గడప గడపకు వెళ్లి ప్రజలను కలుసుకొని ఫ్యాను గుర్తుపై ఓటేసి తనను గెలిపించి ఆశీర్వదించాలని ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ఈ ఐదేళ్లు మీ ఇంటిలో మంచి జరిగితేనే వైసిపి ప్రభుత్వానికి ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు కొండపల్లి బాలకష్ణ, పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ మంత్రి రవికుమార్‌, వైస్‌ చైర్మన్‌ యిండుపూరు గున్నేశ్వరరావు, స్థానిక వార్డుల కన్వీనర్లు సామల లలిత కుమారి, చందాన ఆనంద్‌, జెసిఎస్‌ కన్వీనర్‌ గొర్లి మాధవరావు, కౌన్సిలర్లు, జగన్నాధం టెంపుల్‌ చైర్మన్‌ పాలవలస శ్రీనివాసరావు, జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షులు ఎస్‌ శ్రీనివాసరావు, పిఎసిఎస్‌ చైర్మన్‌ తీల్ల శివున్నాయుడు, వైస్‌ ఎంపిపి సిద్దా జగన్నాథ రావు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, గృహ సారథులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. గుమ్మలక్ష్మీపురం : మండలంలోని ఇరిడి, చెముడుగూడ, కుక్కిడి పంచాయతీల పరిధిలో గల పలు గ్రామాల్లో ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా తాటిశీలలో అమ్మవారికి పూజలు నిర్వహించి అనంతరం ప్రచారం ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి వైసిపి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ కష్టసుఖాల్లో పాలుపంచుకుని నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశానని ఈ సందర్భంగా అన్నారు. కార్యక్రమంలో ఎంపిపి కె.దీనమయ్య, జిల్లా నాయకులు గోపాల్‌ ఉన్నారు. సీతానగరం :మండలంలోని బక్కుపేటలో స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు గడప గడపకు ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఫ్యాన్‌ గుర్తుకే మా ఓటు అని మాట ఇస్తూ మీరే మళ్లీ ఎమ్మెల్యే, జగనన్నే మళ్లీ ముఖ్యమంత్రిగా వస్తారని ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో మండల, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గృహ సారథులు, స్థానిక ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.వీరఘట్టం : మండలంలోని కంబర, కాగితాడ, చిట్టిపూడి వలస, కిమ్మీ, గడగమ్మ, కొట్టు గుమ్మడ గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే వి.కళావతి, ఎమ్మెల్సీ పి.విక్రాంత్‌ శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తమకు మరోసారి పట్టం కట్టాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో జడ్పిటిసి జంపు కన్నతల్లి- ఉమామహేశ్వరరావు, పిఎసిఎస్‌ డైరెక్టర్‌ రంభ శ్రీనివాసరావు, కార్యకర్తలు ,అభిమానులు, పాల్గొన్నారు.

➡️