రాహుల్‌ గాంధీకి ఎన్నికల కమిషన్‌ నోటీసులు

న్యూఢిల్లీ :   కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి ఎలక్షన్‌ కమిషన్‌ (ఈసి) గురువారం నోటీసులు పంపింది. ప్రత్యర్థులపై నిర్థారణ కాని ఆరోపణలు చేయడం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని ఇసి నోటీసులో పేర్కొంది. శనివారం సాయంత్రంలోగా వివరణనివ్వాల్సిందిగా పేర్కొంది. రాజస్థాన్‌లో మంగళవారం నిర్వహించిన ర్యాలీలో రాహుల్‌ గాంధీ ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బిజెపి చేసిన ఫిర్యాదు మేరకు ఈ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది.

రాహుల్‌ గాంధీ ర్యాలీలో అవమానకరమైన పదాలను ఉపయోగించారని, పలు ఆరోపణలు చేశారని బిజెపి ఫిర్యాదులో ఆరోపించింది. ఒక సీనియర్‌ నేత ఇటువంటి పదాలు వినియోగించడం తగదని ఫిర్యాదులో పేర్కొంది.

”మోడీ కొన్ని సార్లు టివిలో కనిపిస్తారు. హిందూ- ముస్లిం అని మాట్లాడతారు. ఒక్కోసారి క్రికెట్‌ మ్యాచ్‌కు వెళతారు. ఇండియా క్రికెట్‌ టీమ్‌ వరల్డ్‌ కప్‌ గెలిచేది కానీ ‘చెడ్డ శకునం’ కారణంగా మ్యాచ్‌ ఓడిపోవాల్సి వచ్చింది” అని రాజస్థాన్‌లో నిర్వహించిన ర్యాలీలో రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు.

➡️