ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు.. ప్రయాణికులను కాపాడి మృతి

Feb 15,2024 10:59 #driver died, #heart attack, #RTC BUS

హైదరాబాద్‌ : విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్‌ గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా పరిధిలో ఇవాళ చోటుచేసుకుంది. వివరాల్లోకి ప్రకారం..సత్తుపల్లి నుంచి ప్రయాణికులతో ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ శ్రీనివాస రావుకు ఉన్నట్టుండి హార్ట్‌ఎటాక్‌ వచ్చింది. అప్పటికే రన్నింగ్‌లో ఉన్న బస్సును అతడు పక్కకు నిలిపి ప్రయాణికుల సాయంతో సమీప ఆస్పత్రికి వెళ్లాడు. ఈ క్రమంలో శ్రీనివాస్‌ రావు చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే మృతి చెందాడు. తనకు గుండెపోటు వస్తున్న విషయాన్ని గమనించి బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను కాపాడిన డ్రైవర్‌ శ్రీనివాస రావుకు విధుల పట్ల ఉన్న నిబద్ధతను ప్రశంసిస్తూనే.. తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

➡️