న్యూఢిల్లీ: విద్యుత్ ద్విచక్ర వాహనాల తయారీదారు ఆథెర్ ఎనర్జీ తన అథెర్ 450ఎస్ స్కూటర్పై భారీ తగ్గింపును ప్రకటించింది. ఈ ఇవి స్కూటర్పై రూ.20,000 మేర తగ్గించినట్లు ఆ సంస్థ తెలిపింది. దీంతో బెంగళూరులో అథెర్ 450ఎస్ ధర రూ.1.09 లక్షలకు, ఢిల్లీలో రూ.97,500కు లభ్యం కానుందని ఆ సంస్థ పేర్కొంది.