నగరిలో పెద్ద పార్క్ : మంత్రి ఆర్.కె.రోజా

Jan 27,2024 17:17 #Tirupati district
rk roja in children park

ప్రజాశక్తి – పుత్తూరు టౌన్ : పట్టణంలోని స్థానిక చింతల కుంట ప్రాంగణంలో చిల్డ్రన్స్ పార్క్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల మరియు యువజన సర్వీసుల క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా పుత్తూరు పట్టణంలో చిన్న పిల్లలు సరదాగా ఆడుకోవడం కోసం చింతలగుంట చిల్డ్రన్స్ పార్క్ నందు మున్సిపాలిటీ జనరల్ నిధులు అక్షరాల రూ.24.00 లక్షల రూపాయలతో నిర్మించనున్న కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శనివారం భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ పుత్తూరులో ఇప్పటికే ఒక పెద్ద పార్క్ నుప్రారంభించగా, అలాగే వడమాలపేట లో పద్మావతి ఉద్యానవనం కూడా ప్రారంభించామని, నగరిలో ఫిబ్రవరి 10వ తేదీన ఒక పెద్ద పార్క్ ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. పుత్తూరు పట్టణంలో చిన్న పిల్లల కోసం చింతలగుంట లో చిల్డ్రన్స్ పార్కును కూడా త్వరలో కంప్లీట్ చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పుత్తూరు. కమిషనర్ కే ఎల్. ఎం ఎన్ రెడ్డి.. మున్సిపాలిటీ. చైర్మన్ హరి. వైస్ చైర్మన్లు డీ జయ ప్రకాష్,డి శంకర్, కౌన్సిలర్ ఏకాంబరం, ఆలయ చైర్మన్లు ప్రజా ప్రతినిధులు, అధికారులు, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

➡️