టెన్త్‌ మూల్యాంకనాన్ని పరిశీలించిన ఆర్‌జెడి

Apr 6,2024 21:50

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : సెయింట్‌ జోసెఫ్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్లో జరుగుతున్న 10వ తరగతి మూల్యాంకనను విద్యా శాఖ రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ విజయ భాస్కర్‌ శనివారం పరిశీలిం చారు. మూల్యాంకనం జరుగుతున్న తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేయడాన్ని అభినందించారు. ఆర్‌జెడితో పాటు డిఇఒ ప్రేమ్‌కుమార్‌ , డిప్యూటీ క్యాంప్‌ ఆఫీసర్‌ యన్‌టి నాయుడు, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ సన్యాసిరాజు పాల్గొన్నారు.

➡️