కులగణన నిర్ణయం హర్షణీయం : రాజ్యసభ సభ్యులు ఆర్‌ కృష్ణయ్య

Nov 23,2023 10:04 #Caste Census, #R Krishnaiah
r krishnaiah on caste census

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కులగణన చేపడతామన్న నిర్ణయం హర్షణీయమని రాజ్యసభ సభ్యులు ఆర్‌ కృష్ణయ్య అన్నారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బిసిల పార్టీగా చెప్పుకునే టిడిపి ఇప్పటి వరకూ బిసిలను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంది తప్ప వారిని సామాజిక, రాజకీయ, ఆర్థిక సాధికారత సాధించే దిశగా ఎలాంటి ప్రయత్నం చేయలేదని విమర్శించారు. ఇతర పార్టీలన్నీ బిసిలను ఓటర్లుగా మాత్రమే చూస్తారని, జగన్‌ మాత్రమే తమ కుటుంబ సభ్యులుగా చూస్తారని అన్నారు. రాష్ట్రంలో బస్సు యాత్రలకు జనం నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు.

➡️