ప్రజాశక్తి-రైల్వేకోడూరు(అన్నమయ్యజిల్లా) : జాతీయస్థాయి స్కేటింగ్ పోటీల్లో విజ్డం సిబిఎస్సి పాఠశాల విద్యార్థి ఎం పునీత్ రాయ్ బంగారు పతకం సాధించాడని పాఠశాల డైరెక్టర్ డాక్టర్ ప్రదీప్ అడ్మిన్ డైరెక్టర్ మదన్మోహన్ తెలిపారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మదన్మోహన్ మాట్లాడుతూ.. గతవారం కోయంబత్తూరులో స్వస్తిక్ ఇంటర్నేషనల్ స్పీడ్ స్కేటింగ్ రింక్ వారు నిర్వహించిన అండర్ 11 నేషనల్ స్పీడ్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్లో తమ విద్యార్థి పునీత్ రాయ్ పాల్గొని బంగారు పతకం సాధించాడన్నారు. క్రీడలు పిల్లలకు మానసిక ఉల్లాసంతో పాటు పోటీ తత్వాన్ని పెంచి జీవితంలో ఎదగడానికి తోడ్పడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కోటేశ్వరరావు విద్యార్థుల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.