ప్రయివేటు బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు

Mar 17,2024 20:25 #15, #injured, #overturned, #people, #private bus

ప్రజాశక్తి-అద్దంకి (బాపట్ల జిల్లా) : ప్రయివేటు బస్సు బోల్తాపడి 15 మందికి గాయాలైన సంఘటన బాపట్ల జిల్లా అద్దంకి మండలంలోని తిమ్మాయపాలెం గ్రామ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దర్శి మండలం కొర్రమడుగు గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి తమ మనుమరాలు పుట్టువెంట్రుకల మొక్కు తీర్చుకోవడం కోసం ప్రయివేటు స్కూల్‌ బస్సులో కోటప్పకొండకు బయలుదేరారు. తిమ్మాయపాలెం సమీపంలోకి రాగానే బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించి స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని బస్సులో గాయపడిన వారిని బయటకు తీసి అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని సిఐ కృష్ణయ్య పరామర్శించారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️