ఒకేషనల్ అవార్డుల ప్రధానం

Jan 17,2024 23:40

ప్రజాశక్తి – వేటపాలెం
వివిధ రంగాల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన వారికి వేటపాలెం రోటరీ క్లబ్ అవార్డులను ప్రధానం చేశారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులోని రోటరీ భవన్లో బుధవారం జరిగిన సభలో కారంచేడు వశిష్ట, అరే రామ జప యజ్ఞాశ్రమం ఉత్తర పీఠాధిపతి విశ్వంభరానందగిరి స్వామి మాట్లాడారు. వివిధ వృత్తుల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు ఇవ్వటం సంతోషదాయకం అన్నారు. 16మందికి అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో గొల్లపూడి సీతారాం, అధ్యక్షులు బట్ట మోహనరావు, కార్యదర్శి ఎవి సురేష్ బాబు, మాజీ అధ్యక్షులు నాగేంద్రబాబు పాల్గొన్నారు.

➡️