గుజరాత్ : దేశంలోనే అతిపెద్ద కేబుల్ వంతెనగా పేరు పడ్డ సుదర్శన్ సేతును ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ప్రారంభించారు. గుజరాత్లోని ద్వారకలో ఉన్న ఈ వంతెన ఉంది. 2017లో ప్రధాని మోడీ ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బెయిట్ ద్వీపాదన్ని ఓఖ్రా పోర్టుతో కలుపుతూ ఈ వంతెనను రూ.979 కోట్లతో నిర్మించారు. నాలుగు లేన్లు ఉన్న ఈ బ్రిడ్జి పొడవు 2.3 కిలోమీటర్లు, వెడల్పు 27.20 మీటర్లు.
కాగా, ప్రధాని మోడీ నేడు పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఆయన రాజ్కోట్లోని (గుజరాత్) తొలి ఎయిమ్స్ ఆసుపత్రికి ప్రారంభిస్తారు. ఆ తరువాత ఏపీ, పంజాబ్, ఉత్తర్ప్రదేశ్, పశ్చిమబెంగాల్లో ఎయిమ్స్ ఆసుపత్రులను కూడా వర్చువల్గా ప్రారంభిస్తారు. ఈ ఐదు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను మొత్తం రూ.6300 కోట్లతో ప్రభుత్వం నిర్మించారు. కాగా, గుజరాత్లో నేడు సాయంత్రం జరిగే రోడ్ షోలో కూడా ప్రధాని మోడీ పాల్గొంటారు.