యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లిలో రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము బుధవారం పర్యటించారు. ఈ క్రమంలో పోచంపల్లికి ఇండియన్ ఆర్మీకి చెందిన రెండు ప్రత్యేక హెలికాప్టర్లలో రాష్ట్రపతి వెళ్లారు. అయితే ఈ రెండు హెలికాప్టర్లు అక్కడ ల్యాండింగ్ అవుతున్న సమయంలో పోలీసులు గాలికి ఎగిరిపడ్డారు. దీంతో బందోబస్తులో ఉన్న పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. ఉప్పల్ ట్రాఫిక్ ఏసీపీకి చెయ్యి విరిగింది. మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. ఈ ముగ్గురిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.