వేటు పడిన ఐఎఎస్‌లకు పోస్టింగులు

Apr 9,2024 00:29 #ap government, #IAS

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎన్నికల ప్రవర్తనా నియమావళికి వ్యతిరేకంగా, ఏకపక్షంగా పనిచేస్తున్నారనే కారణంతో కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన ఐఎఎస్‌ అధికారులకు ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. ఈ మేరకు జిఓ ఆర్‌టి నెంబరు 676ను సోమవారం విడుదల చేసింది. 2013 ఐఎఎస్‌ బ్యాచ్‌కు చెందిన లక్ష్మీశాకు డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరుగా బదిలీ చేశారు. 2013 బ్యాచ్‌కు చెందిన ఐఎఎస్‌ అధికారి పి రాజబాబుకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎమ్‌డిగా నియమించారు. 2014 బ్యాచ్‌కు చెందిన ఐఎఎస్‌ అధికారి గౌతమిని టిటిడిలో జాయింట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరు (హెల్త్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌)గా నియమించారు. 2015 బ్యాచ్‌కు చెందిన ఐఎఎస్‌ అధికారి బిఆర్‌ అంబేద్కర్‌ను మధ్యాహ్న భోజన పథకం, పాఠశాలల పారిశుధ్యం డైరెక్టరుగా నియమించారు. రాష్ట్ర గృహ నిర్మాణశాఖ ఎమ్‌డిగా పనిచేస్తున్న కె వెంకటరామిరెడ్డికి సివిల్‌ సప్లై కార్పొరేషన్‌ ఎమ్‌డిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. సిసిఎల్‌ఎ జాయింట్‌ సెక్రటరీగా పనిచేస్తున్న ఎన్‌ ప్రభాకర్‌రెడ్డికి సిసిఎల్‌ఎ సెక్రటరీగా పూర్తి అదనపు బాధ్యతలు కేటాయించారు.

➡️