టార్గెట్ల ఒత్తిడితో పోస్ట్ మాస్టర్ మృతి 

Jan 27,2024 16:25 #died, #Kurnool, #postman
post master died by work pressure

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తపాల సబ్ డివిజన్ పరిధిలో సుంకేశ్వరి గ్రామంలో పోస్ట్ మాస్టర్ గా మల్లికార్జునరెడ్డి విధులు నిర్వర్తించేవారు. గ్రామంలో పూర్తి స్థాయిలో సేవింగ్స్ అకౌంట్స్, రికరింగ్ డిపాజిట్లు, సుకన్య సమృద్ది ఖాతాలు సమృద్దిగా ఉన్నాయి. వీటితో పాటు ఉత్తరాల బట్వాడా కూడా చేస్తున్నారు. పనికి మించిన భారంతో విధులు నిర్వహిస్తుంటే, ఇవి కాకుండా ప్రతి రోజు కొత్త అకౌంట్లు చేయాలని అధికారులు ఫోన్ కాల్స్ చేసేవారు. నెలకు 60 కొత్త అకౌంట్లు ఓపెన్ చేయాలని టార్గెట్ విదించేవారు. చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించేవారు.చేయకుంటే మీ జీతాలు నిలిపివేస్తామని, మీ జీతాలు నుంచి తీసుకొని మీ సెల్ఫ్ అకౌంట్లు (డమ్మీ) చేయాలని చెప్పేవారు. అసలే చాలీచాలని జీతాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్న, కనికరం లేని అధికారులు ప్రతి రోజు ఫోన్ కాల్స్ తో వేదించేవారు. టార్గెట్లు వేధింపులు భరించలేక లోలోపల మదనపడి సుంకేశ్వరి గ్రామ తపాల ఉద్యోగి గుండె పోటుతో మరణించడం జరిగింది. ఆయన మృతికి తాపాల శాఖలో పనిచేస్తున్న ఉన్నతాధికారులు కారణం అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా టార్గెట్లు వేదింపులకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకొని మృతుని కుటుంబీకులకు న్యాయం చేయాలని, గ్రామస్థులు కోరుతున్నారు. ఇప్పటికైనా చిరు ఉద్యోగులపై టార్గెట్లు వేధింపులు ఆపాలని, తపాల ఉద్యోగులు అంటున్నారు.

➡️