అక్రమ మద్యం స్వాదీనం

Mar 4,2024 00:09

ప్రజాశక్తి – పంగులూరు
మండలంలోని రేణంగవరంలో ప్రభుత్వ వైన్ షాప్ నుండి నిబంధనలను ఉల్లంఘించి షాపులో పనిచేసే పంగులూరుకు చెందిన సేల్స్ మైన్స్ బి జనార్దనరెడ్డి, వలపర్లకు చెందిన పి నరేష్ ఇద్దరు అధిక లాభార్జన కోసం అక్రమంగా 352క్వార్టర్ బాటిల్స్ వివిధ ప్రాంతాల్లో ఎక్కువ లాభానికి అమ్మకోవడానికి తరలిస్తుండగా ఎస్‌ఐ కెకె తిరుపతిరావు స్వాదీనం చేసుకున్నారు. ఏఎస్ఐ కె రవి, కానిస్టేబుల్స్ కె విజయ్ కుమార్, జె మత్తయ్య, హోంగార్డ్ కట్ట లక్ష్మీనారాయణ కలిసి వారిని పట్టుకుని వారి వద్ద ఉన్న 352 క్వార్టర్ బాటిల్స్ సీజ్ చేశారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి అద్దంకి కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చారు.

➡️