ప్రజాశక్తి-చింతలపూడి(ఏలూరు) : చింతలపూడి మండలం నారెడ్డిగూడెంలో నాటు సారా బట్టిలపై మెరుపుదాడులు నిర్వహించినట్లు చింతలపూడి సీఐ సుధాకర్ రావు తెలిపారు. ఈ దాడుల్లో 200 లీటర్ల బెల్లపు ఉట, 30లీటర్ల సారాను ధ్వంసం చేశామని తెలిపారు. అలాగే నాటు సారా తయారికి ఉపయోగించే వస్తువులను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు. ఈ దాడుల్లో చింతలపూడి ఎస్ఐ కుటుంబరావు, ధర్మజీ గూడెం ఎస్ఐ చెన్నారావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.