ముంబయి : ఇండియన్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐడిఎంఎ) వచ్చే నెలలో ముంబయిలో ఫార్మా లైవ్ ఎక్స్పో, సమ్మిట్ను నిర్వహించనున్నట్లు తెలిపింది. జనవరి 17-19 తేదిల్లో బాంబే ఎగ్జిబిషన్ సెంటర్లో జరగనున్న ఈ ప్రదర్శనకు 500 మంది ప్రదర్శకులు తమ 20,000 ఉత్పత్తులను ప్రదర్శించనున్నారని ఆ సంస్థ తెలిపింది. ఇందులో కేంద్ర ఔషధ శాఖ, ఫార్మాక్సిల్, ఎఫ్ఒపిఇ, ఎఫ్పిఎంఇ, బిడిఎంఎఐ తదితర సంస్థలు భాగస్వామ్యం కానున్నాయని ఆ వర్గాలు తెలిపాయి.