ప్రజాశక్తి- చీపురుపల్లి : వైసిపి పాలనలో ప్రజలు విసుగెత్తిపోయారని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, చీపురపల్లి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కళా వెంకటరావు అన్నారు. గరివిడి మండలంలోని ముఖ్య నాయకులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసిపి పాలనలో ప్రజలు విసుగెత్తిపోయారని ఎన్నికలు ఎంత తొందరగా వస్తాయా టిడిపికి ఓటు వేసి గెలిపిద్దామా అని ఎదురు చూస్తున్నారని అన్నారు. అభివృధ్ది కోసం నిరంతర ఆరాటపడే చంద్రబాబునాయుడు కోసం ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. వైసిపి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేందుకు చేసే పోరాటంలో ప్రజలందరూ కలసి రావాలని కోరారు. నియంత జగన్మోహన్రెడ్డిని సాగనంపితేనే ఈ రాష్ట్ర ప్రగతి సాధ్యమవుతుందని అన్నారు. సమావేశంలో నాయకులు కిమిడి రాంమల్లిక్నాయుడు, గరివిడి మండల నాయకులు పాల్గొన్నారు.