నేడు ఢిల్లీకి పవన్‌, చంద్రబాబు..

ప్రజాశక్తి-అమారావతి : కేంద్ర హౌంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ గురువారం ఢిల్లీ వెళ్తున్నారు. బుధవారం ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి, ముఖ్య నాయకులతో కలిసి.. అమిత్‌ షా, నడ్డాలతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఈ క్రమంలో నేడు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఈ రోజు ఢిల్లీ వెళ్తుండటంతో పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పొత్తులపై క్లారిటీ వస్తే.. రెండు రోజుల్లో మూడు పార్టీలు కలిసి మరో అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఇప్పటికే టీడీపీ, జనసేన కలిపి మొత్తం 99 మంది అభ్యర్థులను ప్రకటించగా మరో 25 మందిని జనసేన ప్రకటించాల్సి ఉంది.

➡️