క‌డుపు నొప్పి భ‌రించ‌లేక‌ నిమ్స్‌లో రోగి ఆత్మ‌హ‌త్య‌

Jan 28,2024 11:22 #hydrabad, #suside

హైద‌రాబాద్: క‌డుపు నొప్పి భ‌రించ‌లేక ఓ రోగి ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘటన హైద‌రాబాద్ న‌గ‌రంలోని నిమ్స్ ఆస్ప‌త్రిలో ఆదివారం తెల్ల‌వారుజామున 4 గంట‌ల‌కు చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఖ‌మ్మం జిల్లా వై ల‌క్ష్మాపురానికి చెందిన అచ్చ‌య్య గ‌త కొంత‌కాలం నుంచి క‌డుపునొప్పితో బాధ‌ప‌డుతున్నాడు. దీంతో జ‌న‌వ‌రి 16వ తేదీన చికిత్స కోసం అచ్చ‌య్య నిమ్స్‌కు వ‌చ్చాడు. ఆదివారం తెల్ల‌వారుజామున 4 గంట‌ల‌కు అచ్చ‌య్య నిమ్స్ స్పెషాలిటీ బ్లాక్‌లోని రెండో అంత‌స్తు నుంచి దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. నిమ్స్ సిబ్బంది పోలీసుల‌కు స‌మాచారం అందించ‌గా, అక్క‌డికి చేరుకుని మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

➡️