ప్రజాశక్తి-విజయవాడ: విజయవాడలో పాస్పోర్టు సేవా కేంద్రంలో సేవలకు అంతరాయం కలిగింది. సుమారు గంటన్నరపాటు సేవలు నిలిచిపోయాయి. సర్వర్ పనిచేయకపోవడంతోనే ఇబ్బంది తలెత్తిందని అధికారులు చెబుతున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. సాధ్యమైనంత వరకు ఈరోజు స్లాట్లు పూర్తి చేస్తామని తెలిపారు. మిగిలిన వారికి మరో రోజు స్లాట్లు ఇస్తామని, అభ్యర్థులు ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు. కాగా విజయవాడ పాస్పోర్టు కేంద్రంలో రోజుకు 550 నుంచి 600 స్లాట్లు ఇస్తున్న విషయం తెలిసిందే.