రన్‌వేపైనే భోజనం చేసిన ప్రయాణికులు.. ఇండిగోకు నోటీసులు

Jan 17,2024 11:18 #airport, #IndiGo

ముంబయి: ఇండిగో, ముంబయి విమానాశ్రయానికి కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. విమానం ఆలస్యంతో ప్రయాణికులు రన్‌వైపై కూర్చుని భోజనం చేసిన వీడియో వైరల్‌ కావడంతో అధికారులు స్పందించారు. విమానాశ్రయంలో అవకాశం ఉన్నప్పటికీ ప్రయాణికులకు ఇండిగో సౌకర్యాలు కల్పించలేదని మండిపడ్డారు. విమానాశ్రయంలో విశ్రాంతి గదులు, రిఫ్రెష్‌మెంట్లు వంటి ప్రాథమిక సౌకర్యాలను పొందే అవకాశం ఉన్నప్పటికీ ప్రయాణికులను రన్‌వేపైనే ఉంచడంపై కేంద్రం మంత్రిత్వ శాఖ అధికారులు ఇండిగోకు నోటీసులు జారీ చేశారు.

➡️