పార్వతీపురం మన్యం ఫస్ట్‌.. కర్నూలు లాస్ట్‌

విజయవాడ : నేడు ఎపి పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం ఉత్తీర్ణత 86.69 శాతం నమోదైంది. ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. అయితే 96.37 శాతంతో పార్వతీపురం మన్యం జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. 62.47 శాతంతో కర్నూలు చివరి స్థానం దక్కించుకుంది. ఎపి రెసిడెన్షియల్‌, బీసీ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 98.43 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల్లో 96.72 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఎపి మోడల్‌ స్కూళ్లలో 92.88 శాతం, సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో 94.56, ఆశ్రమ పాఠశాలల్లో 90.13 శాతం, కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో 88.96 శాతం, ట్రైబల్‌ వెల్ఫేర్‌ పాఠశాలల్లో 89.64 శాతం, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో 79.38 శాతం, ప్రైవేటు ఎయిడెడ్‌ పాఠశాలల్లో 80.01 శాతం, మున్సిపల్‌ హైస్కూళ్లలో 75.42 శాతం విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలల్లో 74.40 శాతం విద్యార్థులు పాసయ్యారు.

ఆన్‌లైన్‌లోనే రీవాల్యుయేషన్‌, రీకౌంటింగ్‌ దరఖాస్తులు
ఫలితాల్లో 69.26 శాతం ఫస్ట్‌ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించారు. 11.87 శాతం సెకండ్‌ క్లాస్‌, 5.56 శాతం మంది థర్డ్‌ క్లాస్‌లో పాసయ్యారు. మే 24 నుంచి జూన్‌ 3 వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. రేపటి నుంచి ఆన్‌లైన్‌లోనే రీవాల్యుయేషన్‌, రీకౌంటింగ్‌ దరఖాస్తులు స్వీకరించనున్నారు. 4 రోజుల్లో అధికారిక వెబ్‌ సైట్‌ నుంచి మెమోలు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించనున్నారు.

➡️