50వ డివిజన్‌లో పంతం ప్రచారం

Apr 9,2024 23:24
మన భవిష్యత్‌.. మన పిల్లల

ప్రజాశక్తి – కాకినాడ రూరల్‌

మన భవిష్యత్‌.. మన పిల్లల భవిష్యత్‌ బాగుపడాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నియోజకవర్గ కోఆర్డి నేటర్‌ పిల్లి సత్యనారాయణమూర్తి అన్నా రు. మంగళవారం పొత్తు గెలవాలి.. పాలన మారాలి అన్న నినాదంతో టిడిపి నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌ పిల్లి సత్యనా రాయణమూర్తి, మాజీ ఎంఎల్‌ఎ పిల్లి అనంతలక్ష్మి, టిడిపి, జనసేన, బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలు 50వ డివి జన్‌లో జనసేన పార్టీ రూరల్‌ నియో జకవర్గ అభ్యర్థి పంతం నానాజీతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతీ ఇంటికి వెళ్లి బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ పథకాలను వివరిస్తూ గ్లాస్‌ గుర్తుకు ఓటేయాలని ఓట ర్లను అభ్యర్థిం చారు. ఈ సందర్భంగా సత్య నారాయణ మూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి పాలనలో రాజకీయ నాయకులు ప్రశ్నించే హక్కును కోల్పోయారన్నారు. చంద్ర బాబుకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే అక్రమంగా జైల్లో పెట్టారన్నారు. జగన్‌ అన్యాయంగా, అక్రమంగా దోచు కున్న డబ్బుతో రానున్న ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభు త్వ పథకాలను తామే ఇస్తున్నామని అబ ద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్‌ చేసిన 12లక్షల కోట్ల అప్పు ల్లో రెండు లక్షల కోట్ల మాత్రమే ప్రజలకు పంచారని, మిగిలిన సొమ్మంతా దోచు కున్నారని అన్నారు. జగన్‌ అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో కూటమి ఏర్పడిందన్నారు. పింఛన్ల పంపిణీలో వైసిపి నాటకాలు ఆడుతుందన్నారు. ఏప్రిల్‌ నెల నుంచే అవ్వా తాతలకు రూ.4వేల పింఛను అందిస్తామని, వారు తీసుకున్న మూడు వేలకు అదనంగా మరో వెయ్యి జూలై నుంచి ఇచ్చే పింఛన్‌తో కలిపి చంద్రబాబు ప్రకటించారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ కూటమి అభ్యర్థులు పంతం నానాజీ, ఎంపి అభ్యర్థి తంగెళ్ల శ్రీనివాస్‌లను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

➡️