ముంబైకి పాండ్యా.. గుజరాత్‌ కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌..

Nov 27,2023 14:46 #IPL, #Sports

ఐపీఎల్‌లో రెండేళ్లుగా గుజరాత్‌ టైటాన్స్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న హార్దిక్‌ పాండ్యాను ఆదివారం నాటి ట్రేడింగ్‌లో ముంబై ఇండియన్స్‌ దక్కించుకుంది. నిజానికి గుజరాత్‌ రిటెన్షన్‌ జాబితాలో హార్దిక్‌ పేరు ఉన్నప్పటికీ అనూహ్యంగా నగదు ఒప్పందంలో భాగంగా పాండ్యాను ముంబై ఇండియన్స్‌ దక్కించుకుంది. ఐపీఎల్‌ 2024 సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌కు కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్‌ను ఆ ఫ్రాంచైజీ ప్రకటించింది. ఈ సందర్భంగా హార్దిక్‌ పాండ్య స్పందించాడు. సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని సోషల్‌ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశాడు. ”ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. ముంబయి, వాంఖడే, పల్టాన్‌.. ఇలా ప్రతిదీ ప్రత్యేకమే. వెనక్కి తిరిగి వచ్చినందుకు ఆనందంగా ఉంది” అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టాడు.

➡️