టిడిపిలో చేరిన పంచాయితీ సభ్యులు

Mar 20,2024 23:52

ప్రజాశక్తి – భట్టిప్రోలు
భట్టిప్రోలు పంచాయతీలో వైసీపీకి చెందిన పాలకవర్గ సభ్యులు, కొంత మంది వారి అనుచరులతో కలిసి టిడిపిలో చేరారు. 16వ వార్డు సభ్యుడు వంగర వీరయ్య, అతని అనుచరులతోపాటు 50మందికిపైగా వైసీపీలో ప్రధాన పాత్ర పోషిస్తున్న వాళ్లు టిడిపిలో చేరారు. వీరందరికీ మాజీమంత్రి నక్కా ఆనందబాబు టిడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టిడిపిలో పనిచేసేందుకు సిద్ధపడి వైసిపి నుండి టిడిపిలో చేరినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో టిడిపి బీసీ సెల్ నాయకులు బట్టు మల్లికార్జునరావు, ఎస్సీ సెల్ నాయకులు కనపర్తి సుందర్రావు, టిడిపి మాజీ మండల అధ్యక్షుడు వై కరుణ శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ ఎడ్ల జయశీలరావు, గొట్టుముక్కల లేనిన్ ఉన్నారు.

➡️