నరసరావుపేట పల్నాడు రోడ్డులోని పాలడుగు నాగయ్యచౌదరి కొత్త రఘురామయ్య కళాశాలలో ‘పల్నాడు విజ్ఞాన కేంద్రం’ ఆధ్వర్యంలో డిసెంబర్ 23, 24-2023 తేదీల్లో పల్నాడు బాలోత్సవం జరిగింది. ఈ పిల్లల పండుగ జిల్లా స్థాయి అంతర పాఠశాలల సాంస్కృతిక పోటీలు రెట్టింపు ఉత్సాహంతో కొనసాగాయి. కోలాటం, జానపద, సాంస్కృతిక, కోలాటం, లంబాడీ పాటలు, లఘు నాటికలు, జానపద నృత్యం, పాటలు, స్పెల్బీ, ప్రాజెక్ట్ పని, రంగ వల్లులు, కోలాటం ,విచిత్ర వేష ధారణ, మెమరీ టెస్ట్ ,వక్తృత్వం, కథలు చెప్పడం, బుర్రకథ, మట్టితో బొమ్మల తయారీ, పేపర్ క్రాఫ్ట్స్ తదితర పోటీల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. బాలబాలికలకు తల్లిదండ్రులకు ఆయా కమిటీల ఆధ్వర్యంలో భోజనం, మంచినీరు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించారు. ఆయా పోటీలలో ప్రతిభ చాటిన బాల బాలికలకు మొమెంటో, ప్రశంసాపత్రం, మెడల్స్ ప్రదానం చేశారు.
పచ్చవ బుజ్జిబాబు
పల్నాడు జిల్లా విలేకరి,
నరసరావు పేట9704075677