పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : పాలకొల్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షులు రేపూరి సూర్య నారాయణ (65) సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పట్టణంలో గత 2 రోజులుగా టిటిడి, అన్నవరం ఉత్సవ విగ్రహాలతో జరిగిన కల్యాణోత్సవంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన 2 సార్లు చాంబర్ ఉపాధ్యక్షులుగా, కొన్ని నెలలపాటు చాంబర్ అధ్యక్షులుగా కూడా పనిచేశారు. ఆయన గౌరవార్థం సోమవారం చాంబర్ షాపులకు శెలవు ప్రకటించారు. సూర్య నారాయణ మృతి పట్ల చాంబర్ సభ్యులు సంతాపం తెలిపారు. ప్రస్తుతం ఆయన గోవింద మాలలో ఉన్నారు.